Header Banner

పార్టీలోకి కోవర్టులను పంపుతున్నారు! సీఎం చంద్రబాబు హెచ్చరిక!

  Wed May 28, 2025 15:35        Politics

మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాబోయే కాలంలో తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉంటుందని చెబుతున్నాను.. ఇది సీబీఎన్ కోట్ అని పేర్కొన్నారు. రాబోయే 47 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్‌ను రూపకల్పన చేశామన్నారు. పార్టీ లోకి వలస పక్షులు వస్తాయ్..పోతాయ్ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. నిజమైన కార్యకర్త పార్టీ లోనే ఉంటారని చెప్పుకొచ్చారు. పార్టీలో కోవర్టులుగా ఉంటూ అజెండా అమలు చేయాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు.


కోవర్టులతో జాగ్రత్త

కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. చంద్రబాబు కీలక ప్రసంగం చేసారు. ఎన్టీఆర్ సంక్షేమ ఆరాధ్యుడని.. తెలుగు చరిత్ర ఉన్నంత వరకు ఎన్టీఆర్ నిలిచిపోతారని కీర్తించారు. కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. నేరస్థులు చేసే మాయా కనికట్టు పై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్య ప్రచారం చేస్తే సహించమని స్పష్టం చేసారు. గుండెపోటుతో వివేకా మరణించారంటే అందరితో పాటుగా తాను నమ్మానని చెప్పుకొచ్చారు. తన లాంటి నాయకుడినే మోసం చేయగలిగారని పేర్కొన్నారు. ఈ నెపం తన పై వేసేందుకు దుష్ప్రచారం చేసారన్నారు.



ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

వారిని ఉపేక్షించం

ఆరు శాసనాలు ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ఆరు శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఎప్పటికప్పుడు నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడి గానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం వెల్లడించారు. కార్యకర్తే అధినేత అని.. వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు. లోకేష్‌కు ఉండే నాలెడ్జ్‌ ఆధారంగా ఆరు శాసనాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. 43 ఏళ్ళుగా టీడీపీ జెండా రెప రెప లాడుతోందంటే అది కార్యకర్తల త్యాగం అని చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ గెలవాలని చంద్రబాబు నిర్దేశించారు.


పథకాల అమలు

ప్రజలకు అండగా ఉండాలని... వారి కోసం పని చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టం చేసారు. అప్పుడే పార్టీకి ఆదరణ ఉంటుందని వెల్లడించారు. పల్నాడులో హత్యలు చేస్తున్నారని.. కొంతమంది టీడీపీలో చేరి కోవర్టులుగా మారి వాళ్ల టార్గెట్‌లను హత్య చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కోవర్ట్‌ల ద్వారా వారి అజెండాను అమలు చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. వలస పక్షులు వచ్చి వెళుతూ ఉంటాయని... కానీ కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. సామాజిక న్యాయం గురించి చాలామంది మాట్లాడారని.. కానీ సామాజిక న్యాయాన్ని టీడీపీ అమలు చేసి చూపించిందన్నారు. తల్లికి వందనం ఈనెల లేదా వచ్చే నెల ఇచ్చేస్తామని తెలిపారు. ఆగ స్టు 15 నుంచి మహిళకు ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ప్రకటించారు . ఆరు సూత్రాలు గేమ్ చేంజర్‌గా ఉపయోగపడతాయన్నారు. పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. ఈ ఆరు శాసనాలను చివరి వరకు తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #AndhraPravasi #Chandrababu #TDP #PoliticalWarning #AndhraPolitics #CovertOperations